37.2 C
Hyderabad
April 26, 2024 20: 54 PM
Slider మహబూబ్ నగర్

కొల్లాపూర్ లో బద్మాష్ రాజకీయాలు చేస్తున్నారు

#Sudharani

కొల్లాపూర్ రాజకీయాల గురించి మరో మహిళా మాజీ ప్రజా ప్రతినిధి నోరు విప్పారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ప్రాంతంలో నీచ రాజకీయాలు చేస్తున్నారని  వాటిని మార్చే బాధ్యత యువతకు ఉందని, యువత రాజకీయాల్లోకి రావాలని కొల్లాపూర్ మాజీ ఎంపీపీ గాదెల సుధారాణి రత్న ప్రభాకర్ రెడ్డి అన్నారు.

స్వామి వివేకానంద జయంతి సందర్భంగా కొల్లాపూర్ మండలం మాచినేని పల్లి గ్రామ స్వామి వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో కీర్తిశేషులు రత్న ప్రభాకర్ రెడ్డి స్మారక జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మాజీ ఎంపీపీ సుధారాణి హాజరై ప్రారంభించారు.

ఈ సంగతి అందరికి తెలిసిందే. అయితే కొల్లాపూర్ ప్రాంతంలో ఎప్పుడు జరగని విధంగా మొత్తం ఈ టోర్నమెంట్లో అరవై రెండు జట్లు తలపడ్డాయి. బుధవారం ఎన్ మాన్ బెట్ల,  కోర్ల కుంట గ్రామ జట్లు పైనల్ లో తలపడ్డాయి. విజేతగా కొర్ల కుంట నిలిచింది.

ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ గాదెల సుధారాణి రత్న ప్రభాకర్ రెడ్డి విజేత జట్టుకు 20 వేల రూపాయలు, రెండవ బహుమతి 10 వేలు, 3వ బహుమతి 5 వేలు అందజేశారు. అంతక ముందు ఆమె మాట్లాడారు. యువత అన్ని రంగాలలో   రాణించాలన్నారు.

మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఎంతో గౌరవించాలన్నారు. అదేవిధంగా  జీవిత భాగస్వామిని కూడా అదేవిధంగా గౌరవించాలని అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపకూడదని సూచించారు. ప్రమాదం జరిగితే కుటుంబ సభ్యులు అనాధగా మారుతారని చెప్పారు.

అదేవిధంగా కొల్లాపూర్ రాజకీయాల గురించి మాట్లాడారు. నేడు జరుగుతున్న రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయో చూస్తున్నారు కదా అని అన్నారు. నీ వర్గం నా వర్గం అంటూ బద్మాష్ రాజకీయాలు చేస్తున్నారు, పనికి మాలిన రాజకీయాలు చేస్తున్నారు ఇలాంటి రాజకీయాలు మార్చాలంటే యువత చేతుల్లోనే ఉందని అన్నారు.

యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. అయితే ఈ సందర్భంగా జి.సుధారాణి రత్న ప్రభాకర్ రెడ్డి మాట్లాడిన మాటలు ఇప్పుడు కొల్లాపూర్ ప్రాంతంలో వైరల్ అయ్యాయి.

Related posts

USFI జాతీయ కన్వీనింగ్ కమిటీ కార్యవర్గ సభ్యునిగా పరశురాం

Satyam NEWS

నిరంకుశ పాలన తో కొల్లాపూర్ ప్రజలు కష్టాలపాలు….!

Satyam NEWS

ట్రయల్ కోర్టు తర్వాత సుప్రీందే తుది నిర్ణయం కావాలి

Satyam NEWS

Leave a Comment