గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను నవంబర్ 1వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశం కనిపిస్తున్నది. మీడియా కథనాల ప్రకారం ఈ ఎన్నికలను రెండు దశల్లో నిర్వహించవచ్చు. డిసెంబర్ మొదటి వారంలో ఓటింగ్ నిర్వహించవచ్చు. ఇప్పటి వరకు వెల్లడైన సమాచారం ప్రకారం మొదటి దశ పోలింగ్ డిసెంబర్ 1 నుంచి 2 వరకు, రెండో విడత పోలింగ్ డిసెంబర్ 4 నుంచి 5 వరకు నిర్వహించవచ్చు. అదే సమయంలో హిమాచల్ ప్రదేశ్తో పాటు గుజరాత్ ఎన్నికల ఫలితాలు కూడా డిసెంబర్ 8న వెలువడవచ్చు.
ఈ ఎన్నికలలో అధికార బీజేపీ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీతో బాటు ఆమ్ ఆద్మీ పార్టీ పెద్ద ఎత్తున రంగంలో దిగుతున్నది. సీఎం అభ్యర్ధిని ముందుగానే ప్రకటించి ఎన్నికలలో దిగాలని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ భావిస్తున్నారు. కేజ్రీవాల్ సీఎం అభ్యర్థి కోసం ప్రజల అభిప్రాయాన్ని ఇప్పటికే కోరారు. సూరత్లో ఈ విషయాన్ని ప్రకటించిన కేజ్రీవాల్, గుజరాత్ ప్రజల నుండి నేను తదుపరి సీఎం ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నాను అని అన్నారు. దీని కోసం ఆమ్ ఆద్మీపార్టీ ఒక సెల్ నంబర్ మరియు ఇమెయిల్ ఐడిని ఇచ్చింది. నవంబర్ 3 సాయంత్రం 5 గంటల వరకు ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చు. దీని తర్వాత నవంబర్ 4న ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి ముఖాన్ని ప్రకటించనుంది.