మహాకవి గురజాడ వర్ధంతి సందర్భంగా ప్రఖ్యాతి ఆధ్యాత్మిక ప్రవచన కర్య చాగంటి కోటేశ్వరరావు గారికి “గురజాడ” విశిష్ట పురస్కారం ఇస్తామని గురజాడ సాంస్కృతిక సమాఖ్య ప్రకటించన మరుక్షణం…. నిరసనలు వెల్లువెత్తడంతో సరిగ్గా ఆయన వర్థంతి రోజు న…విజయనగరం జ్ఞాన సరస్వతి దేవాలయం లో ఆ ఉత్సవం…పోలీసులు బందోబస్తు నడుము జరిగింది. డిప్యూటీ స్పీకర్ కోలగట్ల… ప్రముఖ సాంస్కృతిక సంస్థ ల సమక్షంలో అలాగే గురజాడ నాల్గో వంశీ కుల ముందు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు కు “గురజాడ విశిష్ట పురస్కారం” అందజేశారు.
సాహితీ,కళా రంగంలో అతిరధ మహారధులకు ఇచ్చిన “గురజాడ” పురస్కార అవార్డు ను బ్రహ్మశ్రీ చాగంటి కి ఇచ్చారు.. నిర్వాహకులు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ కోలగట్ల మాట్లాడుతూ…. నా తదనంతరం… నా పిల్లలు కూడా గురజాడ సాంస్కృతిక సమాఖ్య చేసిన కార్యక్రమాలకు శాశ్వత దాతగా ఉంటారన్నారు.పురస్కారం అందుకున్న అనంతరం బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు మాట్లాడుతూ….నేను తీసుకున్న ఈ పురస్కారం ఓ గొప్ప గా తీసుకోవటం లేదని… విజయనగరం వాసుల ఆశీస్సులు గా స్వీకరిస్తానని అన్నారు.
పురస్కారానికి నన్ను పిలిచే ముందు నిర్వాహకులతో ఒకే ఒక విషయం చెప్పానని… నాకు ఇవ్వబోతున్న “గురజాడ విశిష్ట పురస్కారం’…నన్ను కాక వేరొకరి కి ఇచ్చినా….మహాకవి గురజాడ అభిమానిగా ఓ ప్రేక్షకుడిగా వచ్చి ఉత్సవాన్ని తిలకిస్తానని చెప్పానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కాపుగంటి ప్రకాష్ తోపాటు ఏ.గోపాలరావు… భీష్మ… ఇలా పలు సంస్థలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు.