విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి బీజపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. ఉత్తరాంధ్ర అభివృద్ది వేదిక సదస్సునకు పార్టీ ఆదేశాలమేరకు ముఖ్య అతిధిగావిచ్చేసిన ఆయన సదస్సు అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహరంపై కేంద్ర ప్రభుత్వం ఇదివరకే తన నిర్ణయం తెలియ చేసిందన్నారు.అయితే విశాఖలో ఎన్నో వేల మందికి గతకొన్నేళ్లుగా ఉపాది కల్పిస్తున్న స్టీల్ ప్లాంట్ ను సజీవంగానే అభివృద్దిపధంలోముందుకు వెళ్లాలన్నదే కోరుకుంటున్నామన్నారు.
ఈ రాష్ట్రంలో ఉన్నప్రధాన పరిశ్రమ స్టీల్ ప్లాంట్ అని భవిష్యత్ లో ఇంకా ఉజ్వలంగా అభివృద్ది చెందాలని కోరుకుంటున్నామన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వానికి అక్కడ పనిచేసేకార్మికులకు ఉద్యోగస్తులకు భద్రత కావాలని కోరుకుంటున్నామని అంతకు మించి తామేమీ మాట్లాడలేమన్నారు.