టిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి గ్రామ కమిటీల అధ్యక్షులు కృషిచేయాలని ములుగు జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ బడే నాగజ్యోతి, తాడ్వాయి మండలం టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బండారి చంద్రయ్య లు అన్నారు. మంగళవారం తాడ్వాయి గ్రామ టిఆర్ఎస్ పార్టీ, గ్రామ కమిటీ అధ్యక్షుడు గా బంగారి సాంబయ్య ను, గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
నూతన గ్రామ కమిటీ అధ్యక్షులు బంగారి సాంబయ్య మాట్లాడుతూ నా పై నమ్మకంతో గ్రామ కమిటీ అధ్యక్షులు గా ఎన్నుకున్నందుకు ములుగు జిల్లా వైస్ చైర్మన్ నాగజ్యోతి కి, టిఆర్ఎస్ పార్టీ జిల్లా, మండల పార్టీ అధ్యక్షులకు, టిఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు అర్హులైన ప్రజలకు అందే విధంగా కృషి చేస్తానని తెలిపారు. పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జి సి సి డైరెక్టర్ పులుసం పురుషోత్తం, మండల ఉపాధ్యక్షులు నూశెట్టి రమేష్, బీరెల్లి సర్పంచ్ జాజ చంద్రం, మండల అధికార ప్రతినిధి జైపాల్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షులు దిడ్డి మోహన్ రావు, ముండ్రాతి రాజశ్రీ, మహిళా అధ్యక్షురాలు నాగమ్మ, నాయకులు ఇంద్రా రెడ్డి, తాటి రాంచందర్, పత్తి గోపాల్ రెడ్డి, దండుగుల మల్లయ్య, సిద్ధబోయిన సురేందర్, సల్లూరు లక్ష్మణ్, మంకిడి నర్సయ్య, రంగు సత్యనారాయణ, ముండ్రాతి శ్రీనివాస్, డేగల సురేందర్, ఈక రామయ్య, గంగరాజు, విజయ్ తదితరులు పాల్గొన్నారు.