కనీస ఆధారాలు లేకుండా చంద్రబాబు అరెస్ట్, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లేలా చేపట్టాల్సిన కార్యక్రమాల పై తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యలు నేడు ఢిల్లీలో చర్చించారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అధ్యక్షతన టిడిపి పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఢిల్లీలోని ఎంపి గల్లా జయదేవ్ నివాసంలో తెలుగుదేశం ఎంపిలు భేటీ అయ్యారు. చంద్రబాబు అరెస్టు అనంతర పరిణామాలపై పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహం పై చర్చ జరిపారు. అదే విధంగా పార్లమెంట్ సమావేశాల్లో రాబోయే బిల్లులు, టిడిపి అనుసరించాల్సిన వ్యూహంపై కూడా చర్చ జరిగింది.
previous post