ఆరవ విడత హరితహారం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ ఈనెల 25న ప్రారంభిస్తారు. మెదక్ జిల్లా నర్సాపూర్ అడవి పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా మొక్క నాటి ఆయన ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.
రాష్ట్రంలోని అన్ని జాతీయ రాష్ట్ర రహదారుల వెంట మొక్కలు నాటే కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగాలని సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జాతీయ రాష్ట్ర రహదారుల వెంట ప్రతి 30 కిలోమీటర్లకు ఒకటి చొప్పున నర్సరీలు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.