సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో హార్టికల్చర్ ఔట్ సోర్సింగ్ స్టాప్ నల్ల బాడ్జ్ లు పెట్టుకుని నిరసన తెలిపారు.
ఏ పి కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ జె ఏ సి పిలుపు మేరకు విధులకు హాజరౌతూనే నిరసన గళం విప్పారు. తమ డిమాండ్ ల పరిష్కారానికై గత వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పశ్చిమ గోదావరి జిల్లా జె ఏ సి నేత బాబ్జి బుధవారం తెలిపారు.
జిల్లాలో ఏలూరు, జంగారెడ్డిగూడెం లలో కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు ఆయన అన్నారు.
ప్రభుత్వం తమ డిమాండ్ల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని పశ్చిమగోదావరిజిల్లా జె ఏ సి నాయకులు బాబ్జి కోరారు.
ప్రభుత్వం స్పందించకపోతే తదుపరి కార్యాచరణ పై జె ఏ సి అత్యవసర సమావేశం కానుందని బాబ్జి తెలిపారు.