తెలంగాణ విమోచన దినోత్సవం ములుగు జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నేడు ములుగు మండలం జంగాలపల్లి గ్రామంలో బూత్ కమిటీ అధ్యక్షులు రేకుల రాజు జాతీయ జెండా ఎగురవేశారు.
ఈ కార్యక్రమంలో ములుగు మండల ఉపాధ్యక్షులు గొంగళ్ల కట్టయ్య , మండల దళిత మోర్చా అధ్యక్షులు మేకల రవి, నాయకులు ముత్యాల కుమార్, చల్లా మల్లారెడ్డి, కొత్తూరు సాంబయ్య, తోకల లక్ష్మణ్, చల్లా భరత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.