న్యాయవాదుల సంక్షేమం కోసం రాష్ట్ర బార్ కౌన్సిల్ కృషి చేస్తుందని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సాముల రాంరెడ్డి అన్నారు. బుధవారం హుజూర్ నగర్ లో జరిగిన న్యాయవాదుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ న్యాయవాదుల మరియు వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య కార్డులు జారీ చేశారని ఆయన తెలిపారు.
న్యాయవాదులు, వారి కుటుంబ సభ్యులు ఉచితంగా వైద్య సేవలు పొందవచ్చునని ఆయన తెలిపారు. అనంతరం న్యాయ వాదులకు హెల్త్ కార్డులను పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో స్థానిక న్యాయ వాదులు కాల్వ శ్రీనివాస రావు, రాఘవ రావు, యాదగిరి, ప్రవీణ్, మీసాల అంజయ్య పాల్గొన్నారు.
ఇంకా, కొట్టు సురేష్, సురేష్ నాయక్, కృష్ణయ్య, రమణా రెడ్డి, చక్రాల వెంకటేశ్వర్లు, వెంకటేష్ నాయక్, చంద్రయ్య, గోపాలకృష్ణ మూర్తి, లతీఫ్,బాలకృష్ణ, నరసింహా రావు, రవికుమార్, చనగాని మహేష్, నగేష్ నాయక్, శ్రీను నాయక్, పాలిటి శ్రీను తదితరులు కూడా పాల్గొన్నారు.