క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేస్తేనే ఉత్తమ ఫలితాలు సాధించగలమని ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ అన్నారు. పోలీస్ శాఖలోని వివిధ కీలక విభాగాలకు చెందిన డిస్ట్రిక్ క్రైంబ్రాంచ్, స్పెషల్ బ్రాంచ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ టీమ్ పోలీసు అధికారులు, సిబ్బంది, మినిస్టీరియల్ స్టాఫ్ తో స్పెషల్ బ్రాంచ్ కాన్ఫరెన్స్ హాల్లో ఈరోజు సమావేశమయ్యారు. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకొని అప్పగించిన బాధ్యతలను మరింత వేగంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. అదేవిధంగా పోలీస్ సిబ్బందికి సంబంధించిన శాఖాపర అంశాలను పెండింగ్ లేకుండా త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరం సంబంధిత విభాగాల పై ఉందని అన్నారు. పోలీస్ సిబ్బంది సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న జిల్లా పోలీస్ వ్యవస్థలో ఏలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో డీసీపీ ఇంజరాపు పూజ, డీసీపీ LC నాయక్, అడిషనల్ డీసీపీ కె. ప్రసాద్, AR అడిషనల్ డీసీపీ కుమారస్వామి, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ ప్రసన్న కుమార్ , రామనుజం, AO అక్తరూనీసాబేగం పాల్గొన్నారు.