రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం బ్రహ్మాండంగా ముందుకు కొనసాగుతుంది. ప్రముఖులు తమకు చాలెంజ్ రావడమే ఆలస్యం గ్రీన్ చాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటుతున్నారు.
సంతోష్ తన పుట్టినరోజు సందర్భంగా కూడా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి మంచి స్పందన వస్తోంది. రాజకీయ నాయకులు, సినీ తారలు, క్రీడాకారులు అందరూ మొక్కలు నాటి ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తున్నారు.
తాము నాటిన మొక్కలు ప్రేమగా పెంచుకుంటామని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి తన పుట్టిన రోజు సందర్భంగా బెంగళూరు లోని తన నివాసంలో మొక్కలు నాటారు ప్రముఖ హీరోయిన్ అశిక రంగనాథ్.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పటి నుండి తాను ప్రతి ఏటా పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటుతానని చెప్పారు. అదేవిధంగా తన అభిమానులు కూడా ఇదే విధంగా ఎవరి పుట్టిన రోజు వారు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.