ప్రగతి భవన్ లో జరుగుతున్న గణేష్ నవరాత్రులలో భాగంగా నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ మనుమడు హిమాన్షు పూజలు నిర్వహించారు.
మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కుమారుడు అయిన హిమాన్షు జరిపిన ప్రత్యేక పూజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు హాజరయ్యారు.
కేటీఆర్ సతీమణి శైలిమ, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్, పల్లా రాజేశ్వరరెడ్డి తదితరులు కూడా పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.