317 జీవో కింద ములుగు బాలుర ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహించిన హిందీ ఉపాధ్యాయులు నజీరుద్దీన్ సేవలు అభినందనీయమని బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎ.విజయమ్మ పేర్కొన్నారు. శనివారం ములుగు జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఇటీవల బదిలీలో భాగంగా వరంగల్ జిల్లాకు బదిలీపై వెళ్లిన హిందీ ఉపాధ్యాయులు నజీరుద్దీన్ కు ఆత్మీయ వీడ్కోలు సమావేశము పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎ.విజయమ్మ అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నజీరుద్దీన్ ఈ పాఠశాలలో ఒక సంవత్సరం 20 రోజులపాటు పనిచేసి విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసిమెలిసి ఉండడం అభినందనీయమని, పనిచేసిన కాలం అంతా విద్యార్థుల శ్రేయస్సు కోసం పనిచేయడం జరిగిందని తెలిపారు. తర్వాత ప్రభుత్వం జరిపిన స్పౌజ్ బదిలీలలో వరంగల్ జిల్లా వెళ్లిన నజీరుద్దీన్ కు సమావేశం సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం క్యాతం రాజేందర్, పిట్టల మల్లయ్య, బానోతు దేవ్ సింగ్, సతీష్ కుమార్, తోట చంద్రమౌళి, గుండేటి మమత, సంఘ చేరాలు, వసంత, శివనాథుని శారద, బై కానీ రజిత, మైనారిటీ ఉద్యోగ సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి మక్బూల్, రాష్ట్ర కార్యదర్శి సర్వర్ అహ్మద్, విద్యార్థులు పాల్గొన్నారు.