మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని గుంటూరు జిల్లా నరసరావుపేట సమీపంలోని కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి దేవస్థానం పరిధిలోని మాతంగముని హిందూ మాదిగల అన్నదాన సత్రంలో 5 వేల మందికి పైగా మాదిగ భక్తులకు అన్నదాన ప్రసాద వితరణను నిర్వహిస్తున్నట్లు అన్నదాన సత్రం నిర్వాహకులు తెలిపారు.
నరసరావుపేట విజయా రెసిడెన్సీ లో జరిగిన విలేకర్ల సమావేశంలో జీవి.విగ్నేశ్వర స్వామి, చైర్మన్ పాలే పోగు నాగేశ్వరరావు, కార్యదర్శి అడపా రవిబాబు, కోశాధికారినూతక్కి, నాగేశ్వరరావు, న్యాయవాది మల్లెల అశోక్ మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ హాజరవుతున్నారని తెలిపారు.
త్రికోటేశ్వర స్వామి వారిని దర్శించుకునే మాదిగ భక్తులు మాదిగల అన్నదాన సత్రం అన్నప్రసాద వితరణ ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాదిగల నాయకులు మానికొండ శ్రీనివాసు, జూపూడి ప్రసాదు, అట్లూరి విజయ్ కుమార్, పేరి పోగు దాస్ ప్రకాష్,కందుల హిజ్రా, పోగులూరి విజయ్ కుమార్, బొమ్ము జయరావు తదితరులు పాల్గొన్నారు.