విధి నిర్వహణలో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పోలీస్ స్టేషన్ లోకి వెళుతున్న మీడియా ప్రతినిధుల పట్ల దురుసుగా ప్రవర్తించిన కల్వకుర్తి ఎస్ఐ భాస్కర్ పై చర్యలు తీసుకోవాలని నేనుసైతం స్వచ్చంద సంస్థ అధ్యక్షుడు, సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.
ఈ విషయమై తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డికి , నాగర్ కర్నూల్ ఎస్పీ సాయి శేఖర్ కి పిర్యాదు చేసారు. సోమవారం కల్వకుర్తి పోలీస్ స్టేషన్ ఆవరణలోకి వెళ్తున్న కొంతమంది మీడియా ప్రతినిధులను ఎస్ఐ భాస్కర్ అడ్డుకోవడం జరిగిందన్నారు.
అంతే కాకుండా నా పోలీస్ స్టేషన్ లోకి ఎందుకు వచ్చారు అని దాబాయిస్తూ…. జర్నలిస్ట్ లతో వాగ్వివాదానికి దిగారు. సమాజంలో నాలుగవ స్తంభంగా పిలవబడే మీడియా పట్ల ఏ మాత్రం గౌరవం లేకుండా ప్రవర్తించిన ఎస్ ఐ పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.
లేనిపక్షంలో మీడియా హక్కులను కాలా రాసే విదంగా వ్యవహరించడం తో పాటు… పత్రిక స్వేచ్ఛను హరించేలా పనిచేసిన కల్వకుర్తి ఎస్ ఐ ను తొలగించేవారకు న్యాయ పోరాటం చేస్తామని ప్రవీణ్ కుమార్ తెలిపారు