ఎల్లారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్ రావు ప్రచారం
తాను ఎమ్మెల్యేగా గెలిచాక ఇళ్ల నిర్మాణానికే మొదటి ప్రాధాన్యం ఇస్తానని ఎల్లారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మదన్ మోహన్ రావు తెలిపారు. మంగళవారం గాంధారి, ఎల్లారెడ్డి మండలాల్లో గడపగడపకు కాంగ్రెస్ ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా మదన్ మోహన్ రావు మాట్లాడుతూ.. ఇంటి దీపాన్ని ముద్దు పెట్టుకుంటే మూతి కాలినట్టు ఎమ్మెల్యే సురేందర్ తీరు ఉందని విమర్శించారు. మనోడని చందాలు వేసి ఎమ్మెల్యేగా గెలిపిస్తే సురేందర్ మోసం చేసిండని, ఆపదలో ఆదుకొని తగిన బుద్ధి చెప్పాలని, గ్రామాల నుండి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 200 గ్రామాలు తిరిగానని, 60 వేల ఇండ్లు గుడిసెలు సందర్శించానని తెలిపారు. 18 నెలల పాటు కరోనా ఆపద కాలంలో రిస్కు తీసుకుని వందల ప్రాణాలు కాపాడానన్నారు. సొంత ఇంటి కలలకు ఆరాటపడుతున్న పేదలకు పక్కా గృహాల నిర్మాణం అత్యంత ప్రాధాన్యమిస్తానని తెలిపారు. రోడ్లు, మురికి కాల్వ నిర్మాణం పెద్దపీట వేస్తానని, యువత ఉపాధి కోసం ప్రత్యేక కార్యచరణ తయారు చేస్తున్నామన్నారు. తనపై బిఆర్ఎస్, బిజెపిల తప్పుడు ఆరోపణలు నమ్మవద్దని కోరారు.
సత్యం న్యూస్, కామారెడ్డి