తిరుమల శ్రీవారి సేవలో గడిపి తనువు చాలించిన ఒక వ్యక్తి ఇంట్లో నోట్ల కట్టలు బయటపడటం అందరిని ఆశ్చర్య పరిచింది. తిరుపతి శేషాచల నగర్ లో తిరుమల తిరుపతి దేవస్థానం కొందరు సిబ్బందికి ఇళ్లు ఏర్పాటు చేసింది.
ఆ ఇళ్లలో శ్రీనివాసులు అనే వ్యక్తి కూడా ఉండేవాడు. శ్రీనివాసులు తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చే వీఐపిలకు తిరునామం పెట్టేవాడు. అలా తిరునామం పెట్టి మరి వారు ఇచ్చే టిప్పు ఆయన తీసుకునేవాడో ఏమో కానీ శ్రీనివాసులు జీవితం మొత్తం అలానే గడిచింది.
సంవత్సరం క్రితం అనారోగ్యంతో శ్రీనివాసులు మరణించాడు. అయ్యో శ్రీనివాసులు చనిపోయాడు అని అందరూ అప్పటిలో బాధపడ్డారు. ఒంటరిగా ఆయన శేషాచలనగర్ ఇంట్లో ఉండేవాడు. శ్రీనివాసులు చనిపోయాడు కాబట్టి ఇంటిని స్వాధీనం చేసుకోవడానికి నేడు టీటీడీ అధికారులు అక్కడకు వెళ్లారు.
ఇంటిని స్వాధీనం చేసుకొనే ప్రయత్నంలో అక్కడ టిటిడి విజిలెన్స్ అధికారులు పరిశీలన జరిపారు. ఆ సమయంలో ఇంటిలో నోట్ల కట్టలు బయటపడ్డాయి. అంత పెద్ద మొత్తంలో నగదును చూసి అధికారులు నివ్వెరపోయారు. టీటీడీ అధికారులు నగదును లెక్క పెడుతున్నారు.