అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 7 వ తేదీన విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధి లో 50 వేల మంది మహిళలతో మానవ హారం నిర్వహింహనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి లో తెలిపారు. ” బాల్య వివాహాలను రూపుమాపుదాం – టీనేజ్ ప్రేగ్నన్సిని అరికడదాం” అనే నినాదం తో ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.
మానవహారం ఉదయం 8.30 నుండి 9.30 వరకు గంట పాటు నిర్వహించడం జరుగుతుందని, బాల్య వివాహాల నిరోధం, ఎర్లీ మారేజేస్ , టీనేజ్ ప్రగ్నన్సి పై ప్ల కార్డులు, నినాదాల తో మానవ హారం లో పాల్గొంటారని తెలిపారు. ఈ మానవహారం కలెక్టరేట్ వద్దగల ఎన్.టి.ఆర్ విగ్రహం నుండి ఆర్ అండ్ బి , ఆర్.టి.సి కాంప్లెక్స్, బాలాజీ జంక్షన్, ఐసు ఫ్యాక్టరీ , దాసన్నపేట , కోట జంక్షన్ , సింహాచలం మేడ , ఆనంద గజపతి ఆడిటోరియం వరకు కొనసాగుతుందని తెలిపారు.
అనంతరం 10 గంటలకు ఆనంద గజపతి ఆడిటోరియం లో పలు కార్యక్రమలు, ప్రముఖ వక్తల సందేశాలు ఉంటాయని తెలిపారు. ఈ మానవ హారం లో డ్వాక్రా మహిళలు, సఖి బృందాల సభ్యులు, వాలంటీర్లు , కళాశాల విద్యార్ధులు, సచివాలయాల సిబ్బంది, స్వచంద సంస్థల సభ్యులు పాల్గొంటారని తెలిపారు.
ఐ.సి.డి.ఎస్., జిల్లా వైద్య ఆరోగ్య అధికారి, డి.ఆర్.డి.ఎ , మున్సిపల్ కమీషనర్, మెప్మ శాఖల ద్వారా పర్యవేక్షణ జరుగుతుందని, మహిళలంతా పెద్ద ఎత్తున పాల్గొని ఈ మానవహారాన్ని విజయవంతం చేయాలనీ కోరారు. జిల్లాలో బాల్య వివాహాలను పూర్తిగా తగ్గించేలా, టీనేజ్ ప్రగ్నేన్సి లేకుండా చేయాలనీ , తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉండే సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేసేలా అవగాహన కలిగించడం ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశ్యమని స్పష్టం చేసారు.