వరంగల్ జిల్లాలో సెల్ఫీ సూసైడ్ కలకలం రేపింది. సతీష్ అనే వ్యక్తి తన భార్య కాపురానికి రావడం లేదని.. చూడటానికి పిల్లలను కూడా పంపడం లేదని తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. దీంతో సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
భార్య, బావమరిది, అత్తే తన చావుకు కారణమని సతీష్ ఈ వీడియోలో ఆరోపించాడు. కాజీపేట మండలం భట్టుపల్లి రాజీవ్ గృహకల్పలో సతీష్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన మరిన్నీ వివరాలు తెలియాల్సి ఉంది.