38.2 C
Hyderabad
April 29, 2024 13: 26 PM
Slider కరీంనగర్

అక్సిడెంట్:హుజూరాబాద్‌ లో ప్రమాదం 7 గురికి గాయాలు

huzurabad accsident 7 injured 3 serious

కరీంనగర్‌ జిల్లాలోని హుజూరాబాద్‌ మండలం శాలపల్లి ఇందిరానగర్‌ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం గుడిపాడు గ్రామానికి చెందిన కొందరు శనివారం సాయంత్రం కరీంనగర్ లో పెళ్లి వేడుకలు జరుపుకొని తిరిగి వాళ్ళ గ్రామానికి వెళుతుండగా కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద మూల మలుపు ఉండడంతో టాటా వాహనం అదుపుతప్పి బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో పెళ్లి కొడుకుకు సంబంధించిన కుటుంబసభ్యులకు 9 మందికి గాయాలు కాగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్ల చికిత్స మేరకు ఇందులో ఇద్దరి మహిళలకు పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. బాధితులను జమ్మికుంట, హుజూరాబాద్‌ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

అత్యాచారం కేసులో మసీదు హఫీజ్ కు బెయిల్ నిరాకరణ

Satyam NEWS

ఉత్తరాఖండ్‌లో వరద బీభత్సం.. 64 మంది మృతి

Sub Editor

పసుపు మద్దతు ధరకు ఏకగ్రీవ తీర్మానం

Satyam NEWS

Leave a Comment