కరోనా విజృంభిస్తుండటంతో స్వచ్ఛందంగా మూతపడిన హైదరాబాద్ ప్రధాన మార్కెట్లు రేపటి నుంచి తెరుచుకోబోతున్నాయి. కరోనా భయంతో బేగం బజార్, ట్రూప్ బజార్, లాడ్ బజార్, సికింద్రాబాద్ జనరల్ బజార్ మార్కెట్లను స్వచ్ఛందంగా మూసివేశారు.
ఓవైపు కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ, దుకాణాల యజమానులు షాపులు తెరవాలనే నిర్ణయించుకున్నారు. 10 రోజుల విరామం అనంతరం ఆయా మార్కెట్లు రేపటి నుంచి తెరుచుకోనున్నాయి.