27.7 C
Hyderabad
May 14, 2024 05: 20 AM
Slider ప్రత్యేకం

వైసీపీని గద్దె దించేవరకూ పోరాడుతూనే ఉంటా

#raghurama

స్వప్రయోజనాల కోసం బీజేపీ పంచన చేరాలని ప్రయత్నిస్తున్న జగన్ రెడ్డి బోగస్ సర్వేలతో మైండ్ గేమ్ ఆడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, నర్సాపురం పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు అన్నారు. రాష్ట్రం ఇమేజ్ బిల్డింగ్ పేరుతో కోట్లాది రూపాయలు ఇచ్చి వార్తాపత్రికల పేరుతో సర్వేలు చేయించుకుంటున్నారని, తమకు వచ్చే ఎన్నికల్లో 25 పార్లమెంటు స్థానాలు వస్తున్నట్లు రాయించుకుంటున్నారని ఆయన అన్నారు.

వై ఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసు, ఇతర కేసుల కోసం బీజేపీ పెద్దల చుట్టూ తిరుగుతున్న జగన్ రెడ్డి ఈ బోగస్ సర్వే రిపోర్టులు చూపించి తనకు మళ్లీ 25 సీట్లు వస్తాయని, వారందరి మద్దతు బీజేపీకే ఉంటుందని చెప్పుకుని తిరుగుతున్నారని రఘురామకృష్ణంరాజు అన్నారు. వాస్తవానికి రాష్ట్రంలో భయానక పరిస్థితులు నెలకొని ఉన్నాయని, జగన్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ దశలో ఉన్న వైసీపీ పెద్దలు తనపై కూడా తప్పుడు వార్తలు రాయించి సంతోష పడుతున్నారని ఎద్దేవా చేశారు.

వైసీపీ నాయకులు ఏ స్థాయికి దిగిజారిపోయారంటే తాను మూడున్నర సంవత్సరాల క్రితం జగన్ ప్రభుత్వం గురించి భీమవరంలో మాట్లాడిన ఒక పాత వీడియో ఇప్పుడు అమెరికాలో మాట్లాడినట్టుగా ప్రచారం చేసుకుంటున్నారని ఆయన అన్నారు. ఇంత దయనీయమైన పరిస్థితిలో వైసీపీ ఉంది. మళ్ళీ 25 పార్లమెంట్ స్థానాలు, 175 అసెంబ్లీ స్థానాలూ మావే అని వెధవ పబ్లిసిటీ ఇచ్చుకుంటున్నారు. సిగ్గులేని రాజకీయం. ఈ నిరంకుశ అరాచక దోపిడీ ప్రభుత్వాన్ని దింపేవరకు విశ్రమించేది లేదు అని ఆయన అన్నారు.

Related posts

శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో పుష్ప పల్లకి సేవ

Satyam NEWS

డ్రంక్‌ అండ్‌ డ్రైవింగ్ పై ట్రాఫిక్ పోలీసుల కౌన్సిలింగ్

Satyam NEWS

రోడ్డు ప్రమాదాలలో 5గురు మృతి

Bhavani

Leave a Comment