ఆంధ్రప్రదేశ్ లో ఐఏఎస్ అధికారులు, ఐపిఎస్ అధికారుల పనితీరుపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్న విషయం తెలిసిందే. పోలీసు అధికారులు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కన్నా ఎక్కువగా విధేయతతో పని చేస్తున్నారని కూడా ఆరోపణలు చెలరేగుతున్నాయి. జిల్లాల్లో కలెక్టర్లు, సచివాలయంలో ఉన్నతాధికారులు నియమనిబంధనలు కూడా పట్టించుకోకుండా అధికార పార్టీ నాయకులు, మంత్రులు చెప్పింది మాత్రమే చేయడానికి ప్రాధాన్యతనిస్తున్నారనే విమర్శ కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఇలా ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు రాజకీయ నాయకులకు మోకరిల్లడానికి కారణం ఏమిటి? అదే తెలియడం లేదు. విజయవాడలో నిన్న జరిగిన గణతంత్ర వేడుకల్లో ఒక సీనియర్ మోస్టు ఐఏఎస్ అధికారి చేసిన పని చూస్తూ అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. బుధవారం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సహా పలువురు ఐఏఎస్ అధికారులు పాల్గొన్నారు. ముందు వరుసలో సీఎం..అధికారులు ఆయన వెనుక కూర్చొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పిలవగానే వచ్చిన ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఇలా మోకాళ్లపై కూర్చొని ఆయనతో మాట్లాడారు….. అదీ సంగతి.
previous post