పవిత్రమైన తిరుమల పుణ్య క్షేత్రంలో చట్టవిరుద్ధంగా అమ్మేందుకు తరలిస్తున్న అక్రమ మద్యం, గుట్కా ప్యాకెట్లను టీటీడీ విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
విశ్వసనీయ సమాచారం మేరకు తిరుపతి మెయిన్ రోడ్డులో పల్సర్ బైక్ ను ఆపి విజిలెన్స్ సిబ్బంది తనిఖీ చేశారు.
50 గుట్కా ప్యాకెట్లు, నాలుగు క్వార్టర్ బాటిల్స్, ఒక ఫుల్ బాటిల్ మద్యాన్ని విజిలెన్స్ సిబ్బంది సీజ్ చేశారు. పల్సర్ బైక్ లో నిషేధిత వస్తువులని తరలిస్తున్న ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.