నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో నేడు భారీ ఎత్తున అక్రమ సారా బట్టీలను ధ్వంసం చేశారు. కొల్లాపూర్ ఎక్సైజ్ సర్కిల్ లోని బొడబండ తండాలో అక్రమ సారా తయారు చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం రావడంతో నాగర్ కర్నూల్ టిటిఎఫ్ తో కలిసి ఎక్సైజ్ పోలీసులు అక్రమ తయారీదారులపై దాడులు నిర్వహించారు.
ఈ దాడుల్లో 20 లీటర్ల అక్రమ సారాను స్వాధీనం చేసుకున్నట్లు కొల్లాపూర్ ఎక్సైజ్ సి ఐ ఏడుకొండలు తెలిపారు. అదే విధంగా 400 లీటర్ల ఎఫ్ జె వాష్ ను ధ్వంసం చేసినట్లు ఆయన వివరించారు. ఈ సందర్భంగా రెండు కేసులను ఎక్సైజ్ పోలీసులు నమోదు చేశారు.
మొత్తం 1884 కిలోల నల్ల బెల్లం, 140 కిలోల పటిక ను స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు కేసులకు సంబంధించి మొత్తం నలుగురిని అరెస్టు చేసినట్లు కొల్లాపూర్ ఎక్సైజ్ సి ఐ ఏడుకొండలు తెలిపారు. ఈ దాడుల్లో సీఐ రఘునాథరెడ్డి, సీఐ పరమేశ్వర్ గౌడ్, ఎస్ ఐ మమత పాల్గొన్నారు. అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, కొల్లాపూర్