పర్యావరణం విధ్వంసం కాకుండా చూసి, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఐఎన్టీయూసీ రాష్ర్టప్రధాన కార్యదర్శి యరగాని నాగన్నగౌడ్ స్పష్టం చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మేళ్ళచేరువు మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో మైహోమ్ ఇండస్ట్రీలో మంగళవారం పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ సమావేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న INTUC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్నగౌడ్ మాట్లాడుతూ పర్యావరణం విధ్వంసం కాకుండా పరిశ్రమలు నిర్వహించుకోవాలని, ప్రజలు ఆనారోగ్యం పాలు కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని, వారి కోసం ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని, స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు.
previous post