ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో పాకిస్థాన్ చేసిన తప్పుడు ఆరోపణకు భారత్ నేడు ధీటుగా సమాధానం ఇచ్చింది. ఈ సమావేశంలో భారత్పై పాకిస్థాన్ ప్రధాని తప్పుడు ఆరోపణలు చేయడం విచారకరమని ఐక్యరాజ్యసమితిలో భారత మిషన్ ఫస్ట్ సెక్రటరీ మిజితో వినిటో అన్నారు. తన దేశంలో జరుగుతున్న అకృత్యాలను దాచేందుకు పాకిస్థాన్ ప్రధాని బహిరంగంగానే ఈ వేదికను దుర్వినియోగం చేశారని ఆయన అన్నారు.
పొరుగు దేశాలతో శాంతిని కోరుకుంటున్నామని చెప్పుకునే దేశం, సీమాంతర ఉగ్రవాదాన్ని ఎప్పటికీ ప్రోత్సహించదని, ముంబయి ఉగ్రదాడి కుట్రదారులకు ఆశ్రయం కల్పించదని ఆయన అన్నారు. రెండు దేశాలు ఒకదానితో ఒకటి కలిసి ఉన్నాయనే సందేశాన్ని భారతదేశం అర్థం చేసుకోవాల్సిన సమయం ఇప్పుడు వచ్చిందని పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ అనడంతో భారత్ ఈ సమాధానం ఇచ్చింది.
భారత్పై తప్పుడు ఆరోపణలు చేసే ముందు పాకిస్థాన్ తన దుష్టచర్యలను ఒక్క సారి గుర్తుకు తెచ్చుకోవాలని భారత దౌత్యవేత్త మిజితో వినిటో అన్నారు. జమ్మూ కాశ్మీర్ను క్లెయిమ్ చేసే బదులు ఇస్లామాబాద్ సీమాంతర ఉగ్రవాదాన్ని ఆపాలని వింటో పట్టుబట్టారు. పాకిస్థాన్లో మైనారిటీలపై అఘాయిత్యాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయని వినీతో అన్నారు. మైనార్టీ వర్గాలకు చెందిన వేలాది మంది యువతులు అపహరణకు గురవుతున్నారు.
హిందూ, సిక్కు, క్రిస్టియన్ కుటుంబాలకు చెందిన బాలికలను పాకిస్థాన్లో బలవంతంగా అపహరించి పెళ్లి చేసి మతం మారుస్తున్నారని అన్నారు. ప్రపంచంలోని ఇతర దేశాలు దీనిని గుర్తించాలి. ఇది మానవ హక్కుల గురించి, మైనారిటీ హక్కుల గురించి మరియు ప్రాథమిక మర్యాద గురించి ఆందోళన కలిగించే విషయం అని ఆయన అన్నారు. భారత ఉపఖండంలో శాంతి, భద్రత మరియు పురోగతి కోసం భారత్ అహర్నిశలూ ప్రయత్నిస్తున్నది. అయితే సీమాంతర ఉగ్రవాదం అంతం అయినప్పుడే ఇది సాధ్యమవుతుందని ఆయన అన్నారు. అంతర్జాతీయ సమాజానికి ప్రభుత్వాలు మద్దతు ఇచ్చినప్పుడు తమ తమ దేశాలలోని మైనారిటీలపై హింస ఉండదని ఆయన అన్నారు.