టీమిండియా డిసెంబర్ 26 నుంచి దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు మ్యాచ్ ఆడనుంది. అయితే, ఈ టెస్ట్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. సెంచూరియన్ వేదికగా జరుగుతున్న ఫస్ట్ టెస్ట్ కు వరుణడు అడ్డు తగిలే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తోన్నాయి.
అక్యూ వెదర్ రిపోర్ట్ ప్రకారం.. మ్యాచ్ జరిగే 26,27 తేదిల్లో మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. అలాగే, మిగతా రోజుల్లో కూడా ఆకాశం మేఘావృతమై.. చిరు జల్లులు కురిసే అవకాశం ఉందని స్థానిక వాతావరణ అధికారులు చెబుతున్నారు.
మరోవైపు, భారత్తో టెస్ట్ సిరీస్కు ముందు సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో ముందస్తు భద్రతాపరమైన చర్యలు చేపట్టింది.
తొలి టెస్ట్ను ప్రేక్షకులు లేకుండానే నిర్వహించనున్నారు. అంతేకాకుండా దేశీయంగా నాలుగు రోజులపాలు జరిగే మ్యాచ్లను వాయిదా వేస్తున్నట్లు సీఎస్ఏ ప్రకటించింది.