ముంబైకి దక్షిణ నైరుతి దిశగా సుమారు 200 కిలో మీటర్ల దూరాన నిసర్గ తీవ్ర తుపాను కేంద్రీకృతం అయింది. ఇది ఈ రోజు మధ్యాహ్నానికి మహారాష్ట్రలో గుజరాత్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న అలిబాగ్ వద్ద తీరం దాటుతుంది. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయి.
రేపటికల్లా ఇది వాయుగుండంగా బలహీన పడుతుంది. రుతుపవనాల వ్యాప్తి కొనసాగుతోంది. ఈ రోజు తెలంగాణలో కొన్ని చోట్ల 40-50 కిలోమీటర్ల వేగంతో గాలివానలు పడతాయి. కొన్ని చోట్ల భారీ వర్షం పడుతుంది. కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్ని చోట్ల 30-40 కిలోమీటర్ల గాలివేగంతో ఉరుములతో కూడిన వర్షాలు పడతాయి. రాయలసీమలో భారీ వర్షాలు పడతాయి. ఏపిలో మిగతా ప్రాంతాల్లో 41 నుంచి 43 డిగ్రీల ఎండలు కాస్తాయి.