ఇదీ…పార్వతీపురం.ఆర్సీఎం స్కూల్…1982 టెన్త్ క్లాస్ బ్యాచ్.సేవానిరతి..!
పరోప కారార్ధ ఇదం శరీరం..అన్న సూక్తిని వాళ్లు ఆచరించారు..కాదు..కాదు ఆచరణలో పెట్టారు.సేవా హై యజ్ఝ కుండ్ సమిధా మే హమ్ సబ్ జలే.. అంటే…సేవ చేయడంలో యజ్ఙకుండలో సమిధిగా అందరమూ కాలిపోవాలని మన పురాణాలు,ఇతి హాసాలులలో చె్ప్పినట్టుగానే జిల్లాలోని పార్వతీపరం ఆర్సీఎం 1982 నాటి టెన్త్ విద్యార్దులు…సేవ చేయడం ప్రారంభించారు.
ఇటీవలే ఎక్కడెక్కడో ఉన్న నాటి విద్యార్దులంతా…ప్రస్తుతం…వివిధ హోదాలలో ఉంటూ…పలు వృత్తులో నిష్ణాతులుగా పని చేస్తూ..వారి వారి శాఖలలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నవారంతా.. సోషల్ మీడియాపుణ్యమా ఒక్కసారి కలిసారు. అనుకున్నతడవు…అందరూ గెట్ టుగెదర్ నిర్వహించుకున్నారు.తమకు పాఠలు చెప్పిన గురువులను సత్కరించుకుని…ఆ క్షణం నుంచీ ప్రతీ ఒక్కరూ ప్రత్యేకించి పార్వతీపురంలో ఉన్న వారు…సేవా కార్యక్రమాలలో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు.
అందులోభాగంగానే శ్రీరామనవమి సందర్బంగా….పట్టణంలోని ఆశాజ్యోతి ఆశ్రమంలో అనాధ పిల్లల ఆకలిని తీర్చేందుకు శ్రీకారం చుట్టారు.ఈ మేరకు నాటి ఆర్సీఎం 1982 టెన్త్ బ్యాచ్ కు చెందిన రెడ్డిశ్రీనివాసరావు, వై,బాస్కర్,కూర్మ, వారణాసి ప్రసాద్,రాంభట్ల శ్రీనులు సంయుక్తంగా ఆశ్రమంలో పిల్లల ఆకలి తీర్చారు.
ఈ సందర్బఃగా ఆశ్రమంలో పిల్లలందరికీ తమ వంతు సాయంతో పండుగ సందర్బంగా భోజన సదుపాయం కల్పించారు.ఉరుకులు,పరుగులతో ఉన్న ఈ స్పీడ్ యుగంలో ఇతరు ఆకలిని సేవా దృక్పధంతో తీర్చడం..ఎంతైనా ముదావహమేనని అంటోంది..సత్యం న్యూస్.నెట్.
ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం