కడప జిల్లా పులివెందులలో వైసీపీ శ్రేణులు వినూత్న నిరసన చేపట్టారు. చంద్రబాబు పర్యటించిన ప్రాంతాలలను పసుపు నీళ్లు చల్లి శుద్ధిచేసి నిరసన తెలిపారు. పులివెందులలో చంద్రబాబు పర్యటించడం వల్ల పులివెందుల పట్టణం అపవిత్రమైందంటూ వైసీపీ శ్రేణులు రెండు ట్యాంకర్లలో రోడ్లపై పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేశారు.
పట్టణంలో చంద్రబాబు పర్యటించిన పూల అంగళ్లు సర్కిల్, నారా వెంకటేశ్వరస్వామి గుడి ప్రాంతాలను పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేశారు. అయితే వైసిపి శ్రేణులు చేపట్టిన ఈ నిరసన పై సర్వత్రా పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి.