30.7 C
Hyderabad
April 29, 2024 05: 56 AM
Slider కడప

చంద్రబాబు పర్యటనపై వైసీపీ కార్యకర్తల వినూత్న నిరసన

#YCP

కడప జిల్లా పులివెందులలో వైసీపీ శ్రేణులు వినూత్న నిరసన చేపట్టారు. చంద్రబాబు పర్యటించిన ప్రాంతాలలను పసుపు నీళ్లు చల్లి శుద్ధిచేసి నిరసన తెలిపారు. పులివెందులలో చంద్రబాబు పర్యటించడం వల్ల పులివెందుల పట్టణం అపవిత్రమైందంటూ వైసీపీ శ్రేణులు రెండు ట్యాంకర్లలో రోడ్లపై పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేశారు.

పట్టణంలో చంద్రబాబు పర్యటించిన పూల అంగళ్లు సర్కిల్, నారా వెంకటేశ్వరస్వామి గుడి ప్రాంతాలను పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేశారు. అయితే వైసిపి శ్రేణులు చేపట్టిన ఈ నిరసన పై సర్వత్రా పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి.

Related posts

తాజాగా అమెరికాకు తాలిబాన్ పెద్దల హెచ్చరికలు

Satyam NEWS

బ్రుటల్:పశువులపై ఇద్దరి అత్యాచారం అరెస్ట్

Satyam NEWS

చైర్మన్ వైస్ చైర్మన్ భర్తలపై చర్యలు తీసుకోవాలి

Satyam NEWS

Leave a Comment