నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రంగదాసు కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతు నిన్న రాత్రి పరమపదించారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు రంగినేని అభిలాష్ రావు అక్కడకు వెళ్లి రంగదాసు భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించి,వారి కుటుంబానికి తన ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
previous post