తెలుగు రాష్ట్రాలలో ఇంటర్ మీడియట్ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. గత ఏడాది ఫలితాల సమయంలో గందరగోళం చెలరేగి 27 మంది విద్యార్ధులు ఆత్మహత్య చేసుకోగా ఈ సారి పరీక్షల నిర్వహణ నుంచే పలు అవకతవకలు బయటపడ్డాయి. పరీక్షా కేంద్రాల సమాచారం సరిగా ఇవ్వకపోవడం, పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి సౌకర్యాలు లేకపోవడం, ఆఖరు నిమిషం వరకూ హాల్ టిక్కెట్లు రాకపోవడం లాంటి సంఘటనలతో ఇంటర్ విద్యార్ధులు ఎంతో టెన్షన్ గానే పరీక్షలకు హాజరయ్యారు.
తెలంగాణ లో ఇంటర్ మొదటి, రెండవ సంవత్సరం పరీక్షలకు 9.65 లక్షల మంది విద్యార్ధులు హాజరు కావాల్సి ఉంది. వీరిలో 4. లక్షల మంది మొదటి సంవత్సరం, 4.85 లక్షల మంది రెండో సంవత్సరం పరీక్షలు రాయాల్సి ఉంది. ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం అవుతాయి. హైదరాబాద్ లోని వెంగళరావు నగర్ కాలనీ లోని నలందా కాలేజి వద్ద పరీక్షా కేంద్రం పరిస్థితిని చిత్రంలో చూడవచ్చు.