నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ వాసి జానపద ఉత్తమ గాయకునిగా ఉగాది ప్రతిభ పురస్కారం అందుకున్నారు. ముక్కిడిగుండం గ్రామానికి చెందిన సింగర్ గంగం మల్లేష్ యాదవ్ కు ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్ అసొసియేషన్అ ధ్వర్యంలో హైదరాబాద్ బిర్లా ప్లానోటోరియంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఈ పురస్కరాన్ని ఆయనకు అందించారు.
ఆల్ ఇండియా మానవ హక్కుల కమిషన్ చైర్మన్ రవీంద్రకుమార్ సరస్వతి ఉపాసకులు దైవజ్ఞ శర్మ ప్రముఖ కవి, విమర్శకులు, రచయిత కసిరెడ్డి వెంకట్ రెడ్డి, AWJA జాతీయ అధ్యక్షులు డా.కోటేశ్వర రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.