సాధారణ ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అధికారిగా పని చేసి విశేష అనుభవం పొందిన గోపాలకృష్ణ ద్వివేదీ ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చేతిలో బదిలీ అయ్యారు.
గోపాల కృష్ణ ద్వివేదీ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ప్రస్తుతం పని చేస్తున్నారు.
గోపాలకృష్ణ ద్వివేదీ ఎన్నికల అధికారిగా పని చేసిన సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాని కార్యదర్శిపైనే వేటు వేశారు. ఇప్పుడు ఆయనపైనే వేటు పడింది.
రాష్ట్ర ఎన్నికల సంఘానికి సహకరించకుండా పూర్తి స్థాయిలో సహాయ నిరాకరణ చేసిన గోపాలకృష్ణ ద్వివేదీ, పంచాయితీరాజ్ కమిషనర్ గిరిజా ప్రసాద్ పై నేడు బదిలీ వేటు వేశారు.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ ఆదేశాలతో ఆ ఇద్దరు అధికారులను బదిలీ చేశారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆదేశాలు ఇవ్వగా నిమిషాల్లోనే రాష్ట్ర ప్రభుత్వం ఆచరణలో పెట్టాల్సి వచ్చింది.
ఆ స్థానాల్లో మూడు పేర్లతో ప్రతిపాదిత జాబితాను చీఫ్ సెక్రటరీ పంపనున్నారు.