ములుగు జిల్లాలోని మేడారం, కొండాయిగూడెం ఏరియాల్లో ఎమ్మెల్యే సీతక్క పర్య టించారు. జంపన్నవాగు ఉధృతితో అత్యంత ప్రభావితమైన, వరద చుట్టుముట్టిన ప్రాంతాలను సందర్శించేందుకు ప్రాణాలను పణంగా పెట్టి కూలిపోయిన వంతెనను దాటినట్లు సీతక్క తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు. వరద బీభత్సాన్ని ఉద్దేశిస్తూ ఇది సునామీ కంటే తక్కువ కాదని పేర్కొన్నారు.