ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్…జేబులో పెన్ను లేకపోయినా… చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా… స్మార్ట్ ఫోన్ మాత్రం ప్రతీ ఒక్కరి చేతిలో ఉంటోంది. అరచేతిలో వైకుంఠం చూసే..ఈ ఆండ్రాయిడ్ యుగంలో.. ప్రతీ చిన్న విషయం.. క్షణాల్లో యావత్తు ప్రపంచానికే తెలుస్తోంది.
అయితే అసలు విషయానికి వస్తే..ఒకప్పుడు ఒంటరిగా పోటీ చేసి…ఎమ్మెల్యే అయిన విజయనగరం కు చెందిన రాజకీయ నేత…మేరునగధీరుడైన కోలగట్ల వీరభద్ర స్వామి.. అంచలంచెలుగా ఎదిగి… చివరకు శాసనాలు తయారు చేయటం లో నిర్ణయాధికారి నేత స్థాయి కి ఎదిగారంటే..నమ్మకతప్పదు.
వైఎస్సార్ హాయాంలోనే పార్టీ తో నిమిత్తం లేకుండా అసెంబ్లీ లో అడుగు పెట్టిన విజయనగరం ఎమ్మెల్యే… తదనంతరం రాజకీయాలను వంటపట్టించుకుని…వైకుంఠ పాళిలో లాగ..అంచలంచెలుగా నిచ్చెన లు అధిరోహించి.. చివరకు… స్వయంగా ప్రస్తుత సీఎం జగన్ ప్రభుత్వం లో..కేబినెట్ ర్యాంక్ హోదాలో ఏకంగా శాసనాలను తయారు చేసే సభకు అదనపు అధిపతి గా అంటే డిప్యూటీ స్పీకర్ గా ఈ నెల 19న శాసనసభ సాక్షి గా ప్రమాణం చేయబోతున్నారు.
రెండు రోజుల క్రితమే వెలగపూడి లో శాసనసభ ప్రధాన కార్యదర్శి సమక్షంలో డిప్యూటీ స్పీకర్ గా నామినేషన్ లు దాఖలు చేశారు. రెండు రోజుల లో ఎవ్వరూ పోటీగా నామినేషన్ దాఖలు చేయకపోవడం ఈ నెల 19న సోమవారం అసెంబ్లీలో జరిగే శాసనసభ సమావేశాల్లో స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ఈ క్రమంలో నే…ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. ఇదే విషయం పై…ఎమ్మెల్యే వ్యక్తి గత కార్యదర్శి శంకర్… సత్యం న్యూస్. నెట్ తో మాట్లాడుతూ… ఎమ్మెల్యే గారికి పోటీగా ఇంతవరకు ఏ ఒక్కరూ డిప్యూటీ స్పీకర్ గా నామినేషన్ దాఖలు చేయలేదన్నారు. దీంతో విజయనగరం ఎమ్మెల్యే ..డిప్యూటి స్పీకర్ గా ఎన్నికయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని…ఇక శాసనసభ కార్యదర్శి ప్రకటించడమే ఆలస్యం అని..డిప్యూటీ స్పీకర్ పదవి..ఏకగ్రీవంగా కానుందని అన్నారు.
ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం జిల్లా