కేరళలో మరో వ్యక్తికి మంకీ పాక్స్ వ్యాధి నిర్ధారణ అయింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు. దీంతో దేశంలో ఇప్పుడు ఈ వైరస్ సోకిన రెండు కేసులు నమోదయ్యాయి. మొదటి సోకిన వ్యక్తి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుండి వచ్చిన వ్యక్తిగా గుర్తిచాంరు. రెండవ కేసు ప్రయాణ చరిత్ర ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ మాట్లాడుతూ, “ఈ వ్యాధి సోకిన 31 ఏళ్ల వ్యక్తి కన్నూర్కు చెందినవాడు అతనికి పరియారం మెడికల్ కాలేజీలో చికిత్స కొనసాగుతోంది. రోగి ఆరోగ్యంగానే ఉన్నాడు. అతనితో పరిచయం ఉన్నవారు ఆసుపత్రిలోనే ఉన్నారు.”
previous post