పేదల ఇళ్ల నిర్మాణంలో జగన్ రెడ్డి మాటలే తప్పు చిత్తశుద్ధిలేదని, ఇళ్ల నిర్మాణం పై సమీక్ష జరిగిన ప్రతిసారి పేదలకు ఇళ్లు పూర్తి చేయాలని అధికారులకు చెప్పడమే తప్ప అవి ఆచరణలో చూపటం లేదని నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు విమర్శించారు. శుక్రవారం రాత్రి రొంపిచర్ల మండలం తుంగపాడు గ్రామంలో నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమంలో ముఖ్య అతిదిగా పాల్గొన్న డా౹౹చదలవాడకు తుంగపాడు గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు పేదల ఇళ్ల నిర్మాణం పై ఆర్భాటంగా ప్రచారం చేసిన జగన్మోహనరెడ్డి అధికారంలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారన్నారు. జగనన్న కాలనీల పేరుతో మౌలిక సదుపాయాలు లేని చోట ఎక్కడో ఊరికి దూరంగా ఇళ్లస్థలాలు కేటా యించారని, ఇప్పుడు కురుస్తున్న వర్గాలకు ఆ స్థలాలు,రోడ్లు చెదువులను తలపిస్తున్నాయన్నారు. రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోనుగుంట్ల కోటేశ్వరరావు మాట్లాడుతూ స్థలాల మెరక, చదును పేరుతో వైసీపీ నాయకులు,కార్యకర్తలకు వేల కోట్లు దోచిపెట్టారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో రొంపిచర్ల మండల టీడీపీ నాయకులు,కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు.