33.7 C
Hyderabad
April 27, 2024 23: 05 PM
Slider అనంతపురం

బీసీలపై జగన్ సర్కార్ దాడి

బడుగు బలహీన వర్గాల ఓట్లతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీలను ఉక్కు పాదంతో అణచివేస్తున్నారని, తెలుగుదేశం పార్టీ వాల్మీకి బోయ సాధికార కమిటీ రాష్ట్ర చైర్మన్ పూల నాగరాజు ఘాటుగా విమర్శించారు. టిడిపి చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడిని పోలీసులు అరెస్టు చేయడం వెనక జగన్ సర్కార్ హస్తముందని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తుందని వేదికలు ఎక్కి చిలక పలుకులు పలుకుతున్న ముఖ్యమంత్రి ఆచరణలో విభిన్నంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎందరో ముఖ్యమంత్రి పరిపాలన చేసి ప్రజా మన్నన పొందారని తెలిపారు. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైకో పాలన చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు డబ్బు పంపిణీ చేస్తే మొత్తం అభివృద్ధి రిగిపోతుందని చిల్లర కాసులను బెదిరిస్తూ అసలు అభివృద్ధిని మరిచిపోయారని తెలిపారు. బీసీ సంక్షేమానికి రాగి దమ్మిడి ఖర్చు పెట్టలేదని అన్నారు.

Related posts

ఎల్‌నినో తో ప్రపంచమంతటా ప్రభావం

Bhavani

గుంటూరులో క్యాష్ వ్యాన్ నుంచి భారీ చోరీ

Satyam NEWS

లక్కీ ఛాన్స్: కార్పొరేట్ వర్గాలకు తీపి కబుర్లు

Satyam NEWS

Leave a Comment