29.7 C
Hyderabad
April 29, 2024 07: 07 AM
Slider ముఖ్యంశాలు

కేంద్ర సర్వీసులోకి గిరిజన బిడ్డ జానకి

#janaki

డీఎస్పీ నుంచి ఐపిఎస్ కు ఎదిగిన రోళ్లబండ తండా వాసి

సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల పరిధిలోని రోళ్లబండ తండాకు చెందిన  గిరిజన బిడ్డ  జానకి ధరావత్   డీఎస్పీ స్థాయి నుంచి ఐపిఎస్ కు ఎంపిక అయింది. తాజాగా రాష్ర్టానికి కేటాయించిన  ఐపీఎస్  పోస్టుల్లో  ఆమెకు స్థానం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  జానకి 2007లో గ్రూప్ -1 ద్వారా  డీఎస్పీ గా ఎంపికై  రాజమండ్రి, సిరిసిల్ల,  గుంటూరు, పోలీసు అకాడమి రాచకొండలలో విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం జానకి హైద్రాబాద్ ఇంటెలిజెన్స్ ఎస్పీగా  విధులు నిర్వహిస్తున్నారు. రోళ్లబండ తండాకు  చెందిన  జానకి  డీఎస్పీ స్థాయి నుంచి  ఐపిఎస్ కు ఎదగడం పట్ల సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖులు,  ప్రజలు   ఆనందం వ్యక్తం చేస్తు అభినందనలు తెలిపారు.

Related posts

విద్యార్ధుల సమస్యలపై అవగాహనలేని విద్యా మంత్రి

Satyam NEWS

కలెక్టరేట్ ముందు వీఆర్ఏల రిలే నిరాహార దీక్షలు

Satyam NEWS

ములుగు జిల్లాలో రైతు చట్టం వ్యతిరేక ఆందోళన

Satyam NEWS

Leave a Comment