డీఎస్పీ నుంచి ఐపిఎస్ కు ఎదిగిన రోళ్లబండ తండా వాసి
సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల పరిధిలోని రోళ్లబండ తండాకు చెందిన గిరిజన బిడ్డ జానకి ధరావత్ డీఎస్పీ స్థాయి నుంచి ఐపిఎస్ కు ఎంపిక అయింది. తాజాగా రాష్ర్టానికి కేటాయించిన ఐపీఎస్ పోస్టుల్లో ఆమెకు స్థానం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జానకి 2007లో గ్రూప్ -1 ద్వారా డీఎస్పీ గా ఎంపికై రాజమండ్రి, సిరిసిల్ల, గుంటూరు, పోలీసు అకాడమి రాచకొండలలో విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం జానకి హైద్రాబాద్ ఇంటెలిజెన్స్ ఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. రోళ్లబండ తండాకు చెందిన జానకి డీఎస్పీ స్థాయి నుంచి ఐపిఎస్ కు ఎదగడం పట్ల సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖులు, ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తు అభినందనలు తెలిపారు.