వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు డిసెంబర్ 5 6 7 తేదీలలో ఖమ్మం లో జరుగనున్నాయని, వాటిని జయప్రదం చేయాలని ఆల్ హమాలి వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి యర్రా శ్రీకాంత్ పిలుపునిచ్చారు. ప్రజాసంఘాల ఆఫీసులో ఆల్ హమాలి వర్కర్స్ యూనియన్ మిర్చి కోల్డ్ హమాలీల ముఖ్యుల సమావేశంలో యర్రా శ్రీకాంత్ మాట్లాడుతూ ఖమ్మంలో డిసెంబర్ 5, 6, 7తేదీలలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు ఘనంగా జరగబోతున్నాయన్నారు. డిసెంబర్ 5న భారీ ప్రదర్శన, సర్దార్ పటేల్ స్టేడియంలో లక్ష మందితో బహిరంగ సభ జరుగుతుందని, ఈ బహిరంగ సభకు కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ ముఖ్యఅతిథిగా వస్తున్నారన్నారు. ఈ మహాసభలలో వ్యవసాయ కార్మికుల సమస్యలపై ప్రతినిధుల మహాసభలలో చర్చలు జరుగుతాయన్నారు. 6,7 తేదీలలో భక్త రామదాసు కళాక్షేత్రంలో వెయ్యి మందితో ప్రతినిధుల మహాసభ జరగుతుందన్నారు. . ఈ మహాసభలలో కార్మికులు మొత్తం పాల్గొని మహాసభలను జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆల్ హమాలి వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు భూక్య శ్రీనివాస్, నూకల నాగేశ్వరరావు, రామకృష్ణ, ఆంగోతి లక్ష్మణ్, నల్ల మాస వీరస్వామి, దొబ్బ ముత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.
previous post
next post