విజయనగరం జిల్లా వ్యాప్తంగా రోడ్ల దుస్థితిపై ఇప్పటికే తమ పోరాట ప్రళాళికను తెలియ చేసిన జనసేన పార్టీ…తాజాగా నగరంలోని గూడ్స్ షెడ్ వద్ద ఏర్పడ్డ గుంతల వద్ద వినూత్నంగా నిరసన ప్రదర్శన నిర్వహించింది. ఈమేరకు పార్టీ రాష్ట్ర నేత యశస్వి, జిల్లా నేత త్యాడా రామకృష్ణ ఇతర నేతలు…గూడ్స్ షెడ్ వద్ద ఏర్పడ్డ గుంతల చుట్టూ ముగ్గులు వేసారు.
అలాగే అక్కడే మొకాళ్లపై నిల్చుని తమ నిరసనను తెలియ చేసారు.ఈ సందర్బంగా పార్టీ రాష్ట్ర నేత యశస్వి మాట్లాడుతూ…అయ్యా సీఎం జగన్ గారూ చూస్తున్నారా…ఈ గుంతలు. ఇక్కడ మేము వేసిన ముగ్గులతోనైనా లేక తామంతా ఇక్కడ నిర్వహించిన ప్రదర్శనతోనైనా మీరు కనకరిస్తరాని ఆశిస్తున్నామన్నారు.
రోడ్ల దుస్తితిపై వచ్చే నెల 2 న తమ పార్టీ వినూత్నంగా కార్యక్రమం తలపెడుతోందన్నారు.కానీ అప్పట్లో నైనా…ఈ గుంతులు పడ్డ రోడ్ ను ఒకసారి పరిశీలించడంటూ జనసేన పార్టీనేతలంతా వినూత్నంగా ఈ నిరసన ప్రదర్శన నిర్వహించారు