26.7 C
Hyderabad
April 27, 2024 08: 50 AM
Slider గుంటూరు

ఇళ్ళ మోసాలపై జనసైనికుల ఆరా

గుంటూరు జిల్లా తెనాలి అసెంబ్లీ పరిథిలో పేదలందరికి స్వంతిల్లు సాకారం పేరుతో పేదలను మోసంచేసిందని జనసేన నాయకులు ఆరోపించారు. తెనాలి జనసేన పార్టీ కార్యాలయం లో “జగనన్న ఇళ్ళూ పేదలకందరికీ కన్నీళ్ళు ” పేరుతో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో నాయకులు మాట్లాడుతూ ఎకరా 30లక్షలు ఖరీదు చేసేభూమిని 70లక్షలకు కొన్నారని, , పేదవానికి స్వంతిల్లు నిర్మించి ఇస్తామని చెప్పి ఇపుడు వాళ్లే కట్టు కోమ్మని చెబు తున్నారని ,ప్రభుత్వమిచ్చే 1.80వేలతో నిర్మిస్తే 6-7లక్షలు అప్పులు మిగుల్తున్నాయన్నారు. పల్లం భూముల్లో జాగా ఇచ్చి మౌళికసదుపాయాలను కల్పించకపోవటం ,ఎప్పుడో పూర్తయిన టిడ్కో ఇళ్ళనులబ్దిదాలకు అరకొరగా అందచేయటం జాప్యం కరెంటు మీటరుకు వేల వసూళ్ళను, పల్లం తదితర అంశాలపై ఈనెల 12,13,14తేదీలలో ఫోటోలతో ఆరా తీయటం జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తరఫున నియోజకవర్గం ఆర్గనైజింగ్ సెక్రటరీ పసుపులేటి మురళీకృష్ణ, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ తోటకూర వెంకట రమణారావు, స్టేట్ జాయింట్ సెక్రెటరీ బండారు రవికాంత్, జిల్లా ఉపాధ్యక్షులు ఇస్మాయిల్ బేగ్, కార్యదర్శి గుంటూరు కృష్ణమోహన్, కొల్లిపర మండల అధ్యక్షులు ఎర్రు వెంకయ్య నాయుడు, జెట్టి గుణ, దిరిశాల వీరయ్య, అమ్మిశెట్టి హరికృష్ణ, కాకుమాను ఇంద్రజిత్, నాగినేని నాగమణి, బెల్లపు యశ్వంత్ కుమార్, షేక్ కాలేషా తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఈ వాన కాలం లోపే మన చెరువులు నింపుకుందాం

Satyam NEWS

లాక్ డౌన్ సడలింపులు క్షేమమా?

Satyam NEWS

నందలూరు లో భత్యాల విస్తృత పర్యటన

Satyam NEWS

Leave a Comment