రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమక్షంలో మునుగోడు నియోజకవర్గానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో టీఆర్ఎస్లో చేరారు. మునుగోడు మండలం కొరటికల్ గ్రామం 12వ వార్డుకు చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు గులాబీ కండువాలు కప్పుకున్నారు. వారందరినీ మంత్రి పువ్వాడ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.