38.2 C
Hyderabad
April 29, 2024 12: 26 PM
Slider ప్రత్యేకం

పేద జర్నలిస్టు కుమార్తెకు ఐ.ఏ.ఎస్ సి.ఎస్.బి అకాడెమీ డైరెక్టర్ సాయం

#IASacademy

గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న జర్నలిస్ట్ వెంకటేశ్వర్లు కుమార్తె ఇటీవల నీట్ ఫలితాల్లో బి.డి.ఎస్ సీట్ ను సాధించింది. ఈ మేరకు మల్లారెడ్డి దంత వైద్య కళాశాలలో భూమిక కు సీట్ కేటాయించారు. అయితే తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న వెంకటేశ్వర్లు కుటుంబం ఫీజు కు కావాల్సిన డబ్బుల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఆపన్నహస్తం ఇచ్చి ఆదుకున్నారు  సీనియర్ ఐ.ఏ.ఎస్  సి.ఎస్.బి అకాడెమీ డైరెక్టర్ బాల లత.

భూమిక  ఫీజుకు  కావాల్సిన అమౌంట్ ను అందజేసి చక్కగా చదువుకోవలన్నారు. భవిష్యత్తులోనూ ఎలాంటి సహాయమైనా అందిస్తానని హామీ ఇచ్చారు. బాల లత తన కుమార్తె ఉన్నత విద్యాభ్యాసం కోసం ఆర్థికంగా చేయూతనిచ్చినందుకు వెంకటేశ్వర్లు ధన్యవాదాలు తెలియజేశారు. మల్లవరపు బాలలత మన హైదరాబాద్ ప్రెస్ క్లబ్ సీనియర్ మెంబర్ దివంగత ఎం ఐ శౌరయ్య (ఆంధ్రజ్యోతి న్యూస్ ఎడిటర్) అమ్మాయి. బాల లత సివిల్స్ కోచింగ్ తీసుకుంటున్న జర్నలిస్టుల పిల్లలకు కూడా కోచింగ్ లో హెల్ప్ చేస్తున్నారు.

Related posts

Solidarity: మరో పోలీసు అధికారికి కరోనా పాజిటీవ్

Satyam NEWS

తిరుమలలో మహాసుదర్శన సహిత విశ్వశాంతి మహాయాగం

Satyam NEWS

“గీత” ఘన విజయం సాధించాలి: దర్శకసంచలనం వి.వి.వినాయక్

Satyam NEWS

Leave a Comment