జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన ప్రతిష్ఠాన్ హైదరాబాద్ వారు వనపర్తిలో నిర్వహించిన సుస్థిర వ్యవసాయ రాష్ట్రస్థాయి చైతన్య సదస్సు నూతన వ్యవసాయ (ప్రత్యామ్నాయ) విధానము సందర్భంగా రైతు దంపతులతో పాటు రైతులకు సహకరిస్తున్న వివిధ రంగాల వారిని కూడా కిసాన్ సేవా రత్న అవార్డుతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష చేతుల మీదుగా సత్కరించారు. వనపర్తికి చెందిన సీనియర్ జర్నలిస్టు(దూర దర్శన్) బాలస్వామి మల్యాలను వ్యవసాయ వ్యవసాయ అనుబంధ వార్తల విషయంలో సత్కరించారు.
పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్