33.7 C
Hyderabad
April 29, 2024 02: 49 AM
Slider నిజామాబాద్

మాక్లూర్ సంఘటన ఖండించిన ఆర్మూర్ ఎమ్యెల్యే జీవన్ రెడ్డి

#mlajeevanreddy

తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పటి నుండి నేటి వరకు జర్నలిస్టులను నేను ఎంతో గౌరవిస్తున్నాను… ఇవ్వాళ నేను ఈ స్థాయికి చేరుకోవడానికి జర్నలిస్టు మిత్రులే ప్రధాన కారణం… ఉద్యమంలో జర్నలిస్టులు నాకు అందించిన ప్రోత్సాహాన్ని జీవితంలో మరచిపోలేను….. తన నియోజకవర్గంలో జర్నలిస్టుపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను… ఈ చర్యకు పాల్పడిన వారికి శిక్ష పడాల్సిందే….. భవిష్యత్తులో జిల్లాలో ఇలాంటి సంఘటనలు జరగకుండా తగు చర్యలు చేపడతానని నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఆర్మూర్ శాసన సభ్యులు ఏ.జీవన్ రెడ్డి అన్నారు.

ఆర్మూర్ నియోజకవర్గం పరిధిలోని మాక్లూర్ సాక్షి విలేఖరి పోశెట్టిపై టీఆర్ఎస్ కార్యకర్తలు ఇటీవల దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయుడబ్ల్యుజె) జిల్లాలో ఆందోళన ఉధృతం చేసిన విషయం తెలిసిందే. 

ఈ నేపథ్యంలో ఎమ్యెల్యే జీవన్ రెడ్డి ఇవ్వాళ లోవర్ ట్యాంక్ బండ్ లోని టీయుడబ్ల్యుజె కార్యాలయంలో యూనియన్ బాధ్యులతో చర్చలు జరిపారు. ఐజేయూ అధ్యక్షులు కె.శ్రీనివాస్ రెడ్డి, టీయుడబ్ల్యుజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ, సాక్షి నెట్వర్క్ ఇంచార్జ్, హైదరాబాద్ ప్రెస్ అధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డిల సమక్షంలో సామరస్యంగా జరిగిన ఈ చర్చల్లో యూనియన్ నిజామాబాద్ బాధ్యులు కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విరాహత్ అలీ మాట్లాడుతూ మూడు డిమాండ్లను ఎమ్యెల్యే ముందు పెట్టారు. పోశెట్టిపై దాడి జరిపి పైగా ఆయన పైనే తప్పుడు కేసు నమోదు చేయడం విచారకరమన్నారు. వెంటనే కేసును ఉపసంహరించుకోవాలని, పోశెట్టిపై దాడిచేసిన నిందితులపై నామమాత్రంగా కాకుండా హత్యాయత్నం క్రింద 307 కేసు నమోదు చేయాలని, భవిష్యత్తులో ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా భరోసానిస్తూ మీడియా ద్వారా హామీ ఇవ్వాలని ఆయన సూచించారు.

ఈ మూడు డిమాండ్లపై జీవన్ రెడ్డి సానుకులంగా స్పందించారు. వెంటనే చర్యలు చేపడతామని హామీ ఇవ్వడంతో ఫిబ్రవరి 2న,  చేపట్టాల్సిన ఛలో ఆర్మూర్ కార్యక్రమాన్ని విరమించు కుంటున్నట్లు విరాహత్ అలీ ప్రకటించారు. ఈ చర్చల్లో యూనియన్ జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి నరసయ్య, కార్యదర్శి అంగిరేకుల సాయిలు, IJU జాతీయ కౌన్సిల్ సభ్యులు, నిజామాబాద్ జిల్లా సాక్షి బ్యూరో ఇంచార్జి భద్రారెడ్డి,  సాక్షి ఎడిషన్ ఇంచార్జ్ ప్రభాకర్, యూనియన్ నాయకులు దేవిదాస్, పాకాల నర్సింహులు, ప్రమోద్, ప్రసాద్, మండే మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

త్వరలో 41వ డివిజన్ కు మరో రూ. 70 లక్షలు

Bhavani

[Free|Trial] & Can Cbd Oil Be Made From Hemp Cbd Oil Pure India

Bhavani

ములుగు లైన్స్ క్లబ్ ఆఫ్ సారధ్యంలో ఉచితంగా డిక్షనరీల పంపిణీ

Satyam NEWS

Leave a Comment