కడప జిల్లా కలెక్టర్ జిల్లాలోని అక్రిడేటివ్ జర్నలిస్ట్ లకు కడప ప్రెస్ క్లబ్ లో శుక్రవారం నిత్యావసర సరుకులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ సాయికాంత్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా జిల్లాలో ఇటీవల కరోనాతో మృతి చెందిన పాత్రికేయులకు నివాళి అర్పించారు.
గత వారం మొదటి విడతగా కడప, బద్వేలు, కమలాపురం నియోజకవర్గ విలేకరులకు పంపిణీ చేశారు. రెండవ విడతగా తక్కిన నియోజకవర్గాల విలేకరులకు పంపిణీ చేశారు. మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల, రాజంపేట, కోడూరు, రాయచోటి నియోజకవర్గ విలేకరులకు ఉదయం 11 గంటల నుంచి నిత్యావసర సరుకులను అందజేశారు.
పై నియోజకవర్గ విలేకరులే కాకుండా, మొదటి విడత పంపీణీలో సరుకులు తీసుకోని అక్రిడేషన్ ఉన్న జర్నలిస్టులకు కూడా సరుకులు అందజేశారు. కరోనా కష్ట కాలంలో ఉన్న పాత్రికేయులకు వేడినీళ్లకు చన్నీళ్లు తోడుగా ఈ చిరు సహాయం అందడం పై కలం గళం రాజంపేట ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.